టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది అనంతరం వరుస పెట్టి షోలు, సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుస సినిమాలలో అవకాశాలు రావడంతో అనసూయ షోలకి గుడ్ బై చెప్పేసి సినిమాలలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.


తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ట్రోల్స్ బారిన పడుతోంది.  సమయం దొరికినప్పుడల్లా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ హీట్ పెంచుతోంది. తన భర్తను స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు అనసూయ ఇదివరకే పరిచయం చేసింది.


ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా....ప్రస్తుతం అనసూయ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తనకి ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అనసూయకు అమ్మాయిలు అంటే విపరీతమైన ఇష్టం ఉందట. కానీ తన భర్త ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు అని అంటున్నాడట.


కానీ ప్రతీ ఇంట్లో ఓ అమ్మాయి పుట్టాలని టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పేర్కొనడం జరిగింది. అమ్మాయిలు ఉంటేనే.. ఇల్లుకు అందం అంటోందట. కానీ అనసూయ భర్తకు దానికి ఒప్పుకోలేదట.  దీంతో అనసూయ... భర్త తన కోరిక తీర్చడం లేదంటూ తన ఆవేదనను తెలిపింది. ఈ విషయాన్ని అనసూయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: