బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ముంబై లోని ఒక ఫ్లాట్లో ఉరి వేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్లో ఉరి వేసుకొని మరణించారు. అయితే ఈయన మరణం పై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే సినిమాల్లో అవకాశాలు లేక పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఉండడం కారణం గా సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకొని మరణించారు అనే టాక్ ఇండస్ట్రీ లో ఉంది. ఈ విషయం పక్కన పెడితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్లాట్లో ఉరి వేసుకొని మరణించాక ఆ ఫ్లాట్ లో రెంట్ కి ఉండడానికి కూడా చాలామంది భయపడి పోయారు.కానీ మొదటిసారి నటి అదా శర్మ ఆ ఫ్లాట్లో ఉండడానికి నిర్ణయం తీసుకొని ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసింది..ఇక ఈ ఫ్లాట్ కొంటుంది అనే విషయం తెలియగానే చాలామంది అదా శర్మ కు కొనకూడదు అని సలహా ఇచ్చారు.

కానీ ఎవరి మాటలు వినకుండా అదా శర్మ ప్లాట్ కొనుగోలు చేసింది. ఇక ఫ్లాట్ కొన్నాక మళ్లీ రీ డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం తన అమ్మ , అమ్మమ్మ తో కలిసి అదాశర్మ ఆ ఇంట్లో ఉంటుంది. అయితే తాజాగా ఈ ఇల్లు గురించి మాట్లాడుతూ నాకు ఈ ఫ్లాట్లో చాలా పాజిటివ్ నెస్ కనిపిస్తోంది. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం..

అందుకే నేను ఈ ఇంట్లో నే ఉంటున్నాను. అలాగే ఈ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది అంటూ ఆదా శర్మ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ ఏమైనా ఆ ఇంట్లో ఉందా ఏంటి అందుకే ఆ ఇంట్లో తెలియని శక్తి ఉందని అదా శర్మ మాట్లాడుతుంది కావచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: