కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ అభిమాని అయిన రేణుక స్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా బెయిల్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా  57 వ CCH కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టి వేయడం జరిగిందట. దీంతో అటు దర్శన్, పవిత్ర గౌడ ఇద్దరికి నిరాశ మిగిలిపోయింది. రేణుక స్వామి హత్య కేసుల సుమారుగా 17 మంది అరెస్టు అయ్యారు. ఇందులో కేవలం ఇద్దరికీ మాత్రమే బేయిలు వచ్చింది. దీంతో తమకు కూడా బెయిల్ వస్తుందని ఆశించిన రాలేదట.



అటు బెయిల్ పిటిషన్ పైన దర్శన్ న్యాయవాది, ప్రభుత్వా న్యాయవాది వాదనలను సైతం వినిపించారు. దీంతో జడ్జి సైతం చివరికి బెయిల్ ఇవ్వలేమంటూ ప్రకటించారు. ఈ విషయం పైన అటు దర్శన్ భార్య విజయలక్ష్మి మాత్రం చాలా కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చూసిన అభిమానులు సైతం తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. తన భర్తకి బెయిల్ వస్తుందని ఆశించిన దర్శన్ భార్య రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైందట..


దర్శన్ అరెస్ట్ అయినప్పటి నుంచి తన భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఎంతోమంది టాప్ లాయర్లను సైతం తీసుకు వస్తున్న బెయిల్ విషయంలో నిరాశ మిగులుతోంది. అంతేకాకుండా దర్శన్ జైలులో కూడా విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉండడంతో చాలా మంది విమర్శించడం కూడా జరిగింది. జూన్ 10వ తేదీన  బెయిల్ వస్తుందని అనుకున్నప్పటికీ ఎదురుదెబ్బ తగిలిందట. చివరికి దర్శనాన్ని పరప్పన్ అగ్రహారం జరిగిన నుంచి బళ్లారి జైలుకు సైతం తరలించారు. ఇక పవిత్రం గౌడ మాత్రం ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు మరొకసారి దర్శన్ , పవిత్ర గౌడ బెయిల్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: