భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి కూడా ఒకరు .. బాహుబలి సినిమా  తో తెలుగు సినిమా ను పాన్ ఇండియా లెవల్ కు తీసుకువెళ్లిన  రాజమౌళి ..  తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచ సినిమాకు చూపించి ఆస్కార్ అవార్డును అందించాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది . రాజమౌళి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరుకెక్కించారు . అలా వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు కూడా ఒకటి ..


అయితే ఈ సినిమా విషయంలో  రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ చెప్పగానే రాజమౌళి ఎంతో ఎక్సైట్ గా ఫీల్ అయ్యారు. పోలీస్ స్టోరీ కాబట్టి ఈ కథని రాజమౌళి ముందుగా పవన్ కళ్యాణ్ కి చెప్పారు. అప్పుడు పవన్ ఇప్పుడు నాకు సమయం లేదు కొంచెం గ్యాప్ తీసుకుంటానని సున్నితంగా పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమాను తిరస్కరించాడు. అయితే అప్పుడు రాజమౌళి ఇదే కథతో వేరే హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలోనే స్టార్ హీరోగా ఎదుగుతున్న రవితేజతో ఈ సినిమా చేయాలని రాజమౌళి ఒక ఆలోచనకు వచ్చాడు.


అలాగే రవితేజకు తగ్గట్టుగా సినిమాను రెడీ చేయమని విజయేంద్ర ప్రసాద్ కు చెప్పాడు . అలా రవితేజని చూసి అత్తిలి సత్తిబాబు పాత్రని రెడీ చేశారు. అయితే క‌థ‌లో పోలీస్ పాత్రను ఏమాత్రం మార్చుకుండా మిగతా స్టోరీని అంతటినీ కూడా సిద్ధం చేశారు. రాజమౌళి మాత్రం రవితేజ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుని సినిమాని తీశారు. రవితేజసినిమా కోసం 20 రోజులు ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా నటించారు. సూపర్ మూవీ చూసిన రాజమౌళి అనుష్క ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ నటించిన పవన్ కళ్యాణ్ కి హిట్ వచ్చి ఉండేది కాదు అనే విధంగా ర‌వీతేజ న‌టించ‌డు.

మరింత సమాచారం తెలుసుకోండి: