తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య.. అక్కడ తీసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగారు. దీంతో సూర్య సినిమా వస్తుంది అంటే చాలు కేవలం తమిళంలో మాత్రమే కాదు అటు తెలుగులో కూడా వెయిట్ చేసే అభిమానులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే కేవలం కమర్షియల్ సినిమాలు చేయడమే కాదు వైవిధ్యమైన సినిమాలు చేయడంలో సూర్య ఎప్పుడు ముందుంటారు.


 ఒక రకంగా  ఈ హీరో కెరియర్ లో కమర్షియల్ సినిమాల కంటే అటు ప్రయోగాత్మకమైన సినిమాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి మరో సినిమాతోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ స్టార్ హీరో. కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య కెరియర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.



 ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు ఆడియో లాంచ్ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అని చెప్పాలి. అయితే ఆడియో లాంచ్ కార్యక్రమంలో నిర్వహించారు అంటే ముఖ్యఅతిథిగా ఎవరో ఒక హీరోని ఇన్వైట్ చేయడం చూస్తూ ఉంటాము. కాగా కంగువ ఆడియో లాంచ్ కార్యక్రమానికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. అయితే ప్రభాస్ తో పాటు రజనీకాంత్ ను తీసుకొచ్చేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తన స్నేహితుడికి చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుండడంతో  ప్రభాస్ తప్పకుండా వస్తారు అనే టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా ఏకంగా 2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత జ్ఞానవేల్ ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: