కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కంటెంట్ ను పెద్దగా చూసేవారు కాదు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకే కరోనా వచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు చాలా వరకు మారాయి. కరోనా వల్ల కొంత కాలం పాటు దియేటర్లు క్లోజ్ కావడం , టీవీలలో కూడా కొత్త కంటెంట్ ఏదీ లేకపోవడంతో ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ చూడడానికి జనాలు అలవాటు పడ్డారు. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లకి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత అనేక కొత్త కొత్త ఓ టి టి ప్లాట్ ఫామ్ లు కూడా పుట్టుకొచ్చాయి. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ ల మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

కొంత కాలం క్రితమే ఈటీవీ సంస్థ వారు ఈ టీవీ విన్ అనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ వారు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఇతర ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి గట్టి పోటీ ఇస్తుంది. అందులో భాగంగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు ఒక టాక్ షో ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిని అశ్విని దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ టాక్ షో కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న ఇక హీరో హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు , అలాగే ఈ టాక్ షో కు వచ్చే గెస్ట్ లు కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్నవారు అయి ఉండేలా నిర్మాణ సంస్థ వారు ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: