సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ , జయరామ్ ఈ సినిమాలో మహేష్ కు తల్లిదండ్రుల పాత్రలలో నటించగా ... రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశం వివరించాడు. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... గుంటూరు కారం సినిమా భారీ మొత్తంలో నష్టాలను ఏమీ మిగిల్చలేదు. ఒక నైజాం ఏరియాలో తప్పిస్తే అన్ని ప్రాంతాలలో ఆ సినిమా బాగానే కలెక్షన్లను వసూలు చేసింది. ఇక సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. కానీ మేము గుంటూరు కారం అని మాస్ టైటిల్ పెట్టాం. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలకు అర్ధరాత్రి షో లను వేయకూడదు. మేము అలా వేసాము. ఈ రెండు కారణాల వల్లే ఈ సినిమా అనుకున్నంత స్థాయి విజయాన్ని సాధించలేదు అని మేము అనుకుంటున్నాము అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: