ప్రస్తుతం ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా.. సినిమా రంగంలో ఎలా మారుమోగిపోతుందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాలతో ప్రభాస్ పేరు పాన్ ఇండియా రేంజ్ళ‌క్ష‌ మార్మోగిపోతుంది. ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యాం, ఆది పురుష్ ఈ మూడు సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అయితే ఆ వెంటనే సలార్, తాజాగా వచ్చిన కల్కి రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయి ప్రభాస్ రీజన్ క్రేజ్‌ను అమాంతం పైకి తీసుకువెళ్లిపోయాయి. ప్రభాస్ ఇప్పుడు విదేశాలకు వెళ్లిన ఎంతోమంది వీరాభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగటానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఎగబడుతున్నారు అంటే ప్రభాస్ మానియా ఎలా ఉందో చెప్పుకోవచ్చు.


అలాంటి ప్రభాస్ కి ఒక హీరోయిన్ చుక్కలు చూపించింది. ఇది వాస్తవం. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే. ప్రభాస్ - పూజ హెగ్డే కాంబినేషన్లో రాధేశ్యామ్‌ సినిమా వచ్చింది. 2022లో వచ్చిన ఈ పాన్ ఇండియా సెమి సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఈ సినిమా తర్వాత పూజకు వరుసగా డిజాస్టర్లు రావడంతో ఆమె పెద్ద ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. పూజతో.. ప్రభాస్ కొన్ని సన్నివేశాల్లో కరెక్ట్‌గా నటించలేకపోయాడంటూ.. దీనికి ప్రధాన కారణం పూజ హెగ్డ్ హెడ్ వెయిట్ అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కు ఆల‌స్యంగా రావ‌డంతో పాటు వచ్చాక గంటల గంటలు క్యారవ్యాన్‌లో కూర్చుని చిత్ర యూనిట్ ని బాగా ఇబ్బంది పెట్టేదని.. సినీ జనాలు మాట్లాడుకున్నారు.


ఓరోజు షూటింగ్ కి డేట్స్ ఇచ్చి వస్తానని చెప్పి తీరా టైం కు రాకుండా ప్రభాస్‌ని కూడా వెయిట్ చేయించిందట. చిర్రెత్తుకొచ్చిన ప్రభాస్.. పూజతో నటించేందుకు కూడా ఆసక్తి చూపించలేదట. చివరకు వీరిద్దరూ కలిసి చేయాల్సిన సీన్ల‌ ముందు అద్దం అడ్డుగా పెట్టి.. ప్రభాస్‌తో షూట్ చేయించి ఆ తర్వాత పూజతో షూట్ చేసి సిజి వర్క్ చేసి మరి చేయాల్సి వచ్చిందట. పూజ తలపొగ‌రుతో విసిగిపోయిన ప్రభాస్.. ప్రమోషన్లలో కూడా అసలు ఆమెతో మాట్లాడేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదన్న గుసగుసలు.. ఆ సినిమా షూటింగ్ టైంలో వినిపించాయి. సినిమాలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత మాత్రం వర్కౌట్ కాలేదు. అలాగే సినిమా కూడా డిజాస్టర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: