టాలీవుడ్ రౌడీ డైరెక్టర్ గా పేరు  తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా డైరెక్టర్గా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే సందీప్ రెడ్డి బాలీవుడ్లో రణ‌బీర్ తో చేసిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అలాగే వెయ్ కోట్ల వరకు కలెక్షన్లు కూడా రాబట్టింది . అయితే ఈ రౌడీ డైరెక్టర్ యానిమల్ కంటే ముందే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తో ఓ సినిమా తీయాలనుకున్నాడట ..


ఇదే క్రమంలో ఆ సినిమాకి డెవిల్ అనే  టైటిల్ని కూడా ఫిక్స్ చేసి మహేష్ కి కూడా కథ చెప్పాడట. అయితే ఈ సినిమా కథ బోల్డో మరియు మాస్‌గా ఉండటంతో మహేష్ నో చెప్పాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చెప్పుకొచ్చాడు.  అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ నెటిజ‌న్‌ మహేష్ లుక్ తో పోస్టర్ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు.. ఇక ఆ పోస్టర్లో డెవిల్ టైటిల్ తో మహేష్ వింటేజ్ కారు పై కూర్చుని రక్తం మరకలతో ఎంతో వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఇక దీంతో కొందరు మహేష్ అభిమానులు ఈ పోస్టర్ని తెగ వైరల్ చేస్తున్నారు..


ఈ  సినిమా ఆగిపోయింది కానీ డెవిల్ చిత్రాన్ని మహేష్ బాబు చేసి ఉంటే బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు ఇప్పటి వరకు ఎవరు చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. రాబోయే రోజులైనా మహేష్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: