టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. వీరిద్దరు కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇకపోతే 2003 వ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఒక్కడు సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ప్రకాష్ రాజ్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ లో భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 2003 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ లోని మహేష్ , భూమిక నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ మూవీ లో వీరి జంటకు కూడా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఇదే సంవత్సరం జూలై 9 వ తేదీన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా   సింహాద్రి మూవీ విడుదల అయింది. ఈ సినిమాలో కూడా భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ , భూమిక నటనలకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఇలా ఒకే సంవత్సరం విడుదల అయిన ఈ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలలో భూమిక హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాల ద్వారా మహేష్ , ఎన్టీఆర్ లతో పాటు భూమిక కి కూడా సూపర్ క్రేజ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: