టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్లు వున్నారు అంటే వున్నారు అంతే వాళ్లకు పెద్దగా సినిమాలలో స్కోప్ ఉండదు.. కేవలం గ్లామర్ కోసం వాళ్ళని సినిమాలలోకి తీసుకుంటున్నారు. కోట్ల పారితోషకం అందుకుంటున్నారు.. అయితే ఒకప్పటి హీరోయిన్స్ కోసం దర్శకులు కొన్ని పాత్రలు సృష్టించే వారు.. వారు ఆ పాత్రలలో అద్భుతంగా నటించి నటిగా మంచి గుర్తింపు పొందేవారు.. ఈ తరం హీరోయిన్స్ లో ఆ అదృష్టం దక్కింది కేవలం అనుష్కకే అని చెప్పాలి.. ఆరుంధతి సినిమాతో అప్పట్లో అనుష్క ఫుల్ ఫేమస్ అయింది అనుష్క శెట్టి. ఈ ముద్దుగుమ్మ తన ఎంటైర్ కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది..ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

అరుంధతి సినిమాలో "జేజమ్మ"గా ఆమె అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్‌ గా మారిపోయింది. ఆ తరువాత బిల్లా సినిమా లో సూపర్ హాట్ గా కనిపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. వేదం సినిమాలో ప్రాస్టిట్యూట్ గా నటించి తన కెరీర్ లోనే చాలా పెద్ద రిస్క్ చేసింది. పంచాక్షరి, నాగవల్లి  వంటి ఛాలెంజింగ్ రోల్స్ పోషించింది.అలాగే బాహుబలిలో దేవసేనగా నటించి పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయింది..రుద్రమదేవి సినిమాలో అనుష్క తన నట విశ్వరూపం చూపించింది.ఇలా ఎన్నో సినిమాలలో అనుష్క అద్భుతంగా రానించింది.. అయితే అనుష్క కి కనుక అరుంధతి వంటి పవర్ ఫుల్ సినిమా కనుక వచ్చి ఉండక పోతే తన కెరీర్ అంతా గ్లామర్ రోల్స్ తోనే నిండిపోయేదని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..అనుష్క కెరీర్  గ్లామర్ హీరోయిన్ గా ప్రారంభించింది..అరుంధతి సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ లా నిలిచింది.. అలాంటి పాత్ర ఇప్పటి స్టార్ హీరోయిన్స్ కి దొరకడం కష్టమే..దొరికినా కూడా అనుష్క లా నటించడం మాత్రం కష్టమే అని చెప్పాలి.. అంతలా ఆమె ఆ పాత్రలో లీనమైపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: