మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ గత పది సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న‌ పూరి అనుకోకుండా ప్లాప్‌లు ఎదురవటంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పురి జగన్నాథ్ సినిమాలకు టాలీవుడ్ లోనే ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే పడి చచ్చే వారు చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆస‌లు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమాగా చేసిన లైగ‌ర్ భారి డిజాస్టర్ గా మిగిలింది.


మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వల్ గా డబుల్‌ ఇస్మార్ట్ అంటూ మరో సినిమా చేశాడు పూరి.. ఇది కూడా ఆయనకు డిజాస్టర్ గానే మిగిలింది. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్.తెలుగులోనే వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్న అక్కినేని హీరో అఖిల్ తో పూరిసినిమా చేయిబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా పూరి మరియు చార్మి కలిసి నిర్మిస్తారని కూడా అంటున్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు నిర్మాణం కూడా అవసరమా అంటూ కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు.


ఆయన మాత్రం తాను చేసే సినిమాకు తానే నిర్మాత అయితే న్యాయం జరుగుతుందని  కావలసిన బడ్జెట్ తాను పెట్టుకుంటారని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు డిజాస్టర్ హీరో అఖిల్ తో ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు పూరి జగన్నాథ్.  గతంలో విజయ్ దేవరకొండ తో ప్రయోగం చేసి ఫెయిల్యూర్ గా.. నిలిచి ఆయన కెరియర్ కి కూడా కాస్త బ్రేక్ పడేలా చేశాడు.. ఇప్పుడు మరో హీరో అంటే ఇంకా అఖిల్ ఏ లెవెల్ లో బలవుతాడో అంటూనెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.   ఏది ఏమైనా పూరి మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని.. అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్న‌రు. ఇక మరి ఈ ఇద్దరి ప్లాప్‌ కలయక వీరికి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: