టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ మొదటగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తూ ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని , ఈ సినిమాను మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ కొంత స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఈ టీజర్ పై వచ్చింది. కొంత మంది ఈ సినిమా టీజర్ లోని గ్రాఫిక్స్ అద్భుతంగా లేదు అని , ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపు ఈ మూవీ లోని గ్రాఫిక్స్ ను మరింత మెరుగు పరిచి థియేటర్లలోకి తీసుకు వస్తే బాగుంటుంది అనే వాదనను వినిపించిన వారు కూడా కొంత మంది ఉన్నారు. ఇకపోతే చిరంజీవిసినిమా గ్రాఫిక్స్ విషయంలో మరో దర్శకుడి సహాయం తీసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనితనాన్ని దగ్గరుండి చూసుకోవాలి అని వి వి వినాయక్ కి చిరంజీవి సూచించినట్లు , ఆయన కూడా అందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి విశ్వంభర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: