మనదేశంలో సినీ సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలామంది ఇతర దేశాల నుంచి సెలబ్రిటీలను కలవడానికి వస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను కూడా కలవడం జరిగింది అభిమానులు.. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ని కలుసుకునేందుకు ఒక అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. అల్లు అర్జున్ కలిసేందుకు ఒక అభిమాని ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘడ్ నుంచి హైదరాబాద్ కి సైకిల్లో వచ్చారట. ఈ విషయం తెలిసి అటు అల్లు అర్జునే కాకుండా ఆయన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.


1600 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఆ అభిమానిని అల్లు అర్జున్ కలవడం కూడా జరిగింది. అల్లు అర్జున్ ని చూసి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుని ప్రయత్నం చేయగా అల్లు అరవింద్ అతనికి వెంటనే ఒక పూలకుండిని బహుమతిగా ఇవ్వడమే కాకుండా తన అభిమాని కోసం ఒక పని చేశారు.. అదేమిటంటే తాను ఏదైనా ఫ్లైట్ బుక్ చేస్తానని సైకిల్ పై వెళ్లొద్దు అంటూ అభిమానిని కోరడం జరిగింది.


అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా తన స్టాఫ్ చూసుకుంటుంది అని తెలిపారు అల్లు అర్జున్. ఒక అభిమాని సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన ఈ సైకల్ని కూడా బస్సుకి బుక్ చేసి పంపించేలా ప్లాన్ చేశారట అల్లు అర్జున్ దాని ఖర్చులకు కూడా కొంత డబ్బును సైతం ఇచ్చినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తున్నది. అంతేకాకుండా పుష్ప సినిమా ప్రమోషన్స్లో కచ్చితంగా ఉత్తరప్రదేశ్ కి వస్తే కచ్చితంగా అభిమానిని కలుస్తానని మాట కూడా ఇచ్చారట అల్లు అర్జున్ అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ మారుతున్నది. అయితే ఈ విషయం విన్న అభిమానులు కూడా అల్లు అర్జున్ చేసిన పనికి ఫిదా అవుతూ తమ అభిమాని కోసం ఇంతలా కేర్ తీసుకుంటారా అంటూ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: