టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నాగచైతన్యసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఆ సినిమా సమయంలోనే సమంతతో ప్రేమలో పడిన చైతు సమంతను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.


వివాహ అనంతరం సమంత, నాగచైతన్య ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాల్లో కూడా నటించారు. కానీ వీరిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలో దివ్యాంశ కౌశిక్ కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ సినిమా సమయంలోనే దివ్యాంశ కౌశిక్ తో చైతు ఎఫైర్ పెట్టుకున్నాడని అనేక రకాల రూమర్స్ వచ్చాయి.


అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకుంటారని కొంతమంది అనుకున్నారట. ఇక ఆ వార్తలకు తగినట్లుగానే నాగచైతన్య, సమంత మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం చైతు దివ్యాంశ కౌశిక్ ను వివాహం చేసుకుంటారని అనుకునేలోపే నటి శోభితతో లవ్ రిలేషన్ కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అందరూ దివ్యాంశను వివాహం చేసుకుంటారని అనుకుంటే ఇంతలోనే శోభితను ప్రేమించి నాగచైతన్య ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ జంట వివాహం జరగనుంది.


ఇది ఇలా ఉండగా హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్య... గత 14 సంవత్సరాల కిందట.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే నాగచైతన్య అలాగే సమంత ప్రేమలో పడ్డారు.  ఆ తర్వాత ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని 2017 సంవత్సరంలో వివాహం చేసుకోవడం జరిగింది. నాలుగు ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడిపోయారు. అంటే 2021 లో నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: