* మల్టీస్టారర్ కి మళ్ళీ ఊపిరూదిన  వెంకీ మామ

* ‘గోపాల గోపాల’ తో సరికొత్త ప్రయోగం

* కానీ ఫలితం మాత్రం బెడిసి కొట్టిందిగా..


టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ ట్రెండ్ గతంలో జోరుగా సాగేది..ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా అలనాటి స్టార్ హీరోలందరూ కూడా చాలా సినిమాలలో కలిసి నటించిన వాళ్లే.. కథకు తగ్గట్టు పాత్రలు ఎంచుకోవడం అప్పటి దర్శకుల పరిపాటి.. కానీ కొన్నాళ్ళకు మల్టీ స్టారర్ ట్రెండ్ ఆగిపోయింది.. హీరోల ఇమేజ్ కూడా బాగా పెరగడంతో వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలు లభించకపోవడంతో మల్టీ స్టారర్ ట్రెండ్ తగ్గింది.. అయితే ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది.. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తోటి నటులతో అలాగే యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఇటీవల కాలంలో వెంకటేష్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “గోపాల గోపాల”.. ఈ సినిమాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వెంకీ మామ కలిసి నటించారు.. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు..గోపాల గోపాల మూవీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన “ ఓ మై గాడ్” సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది..


ఈ సినిమాలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో కనిపిస్తాడు..విలక్షణ నటుడు పరేష్ రావేల్ ఈ సినిమాలో దేవుడిని నమ్మని నాస్తికుడిగా నటించాడు.. ఓ మై గాడ్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. దీనితో రీమేక్ గా తెరకెక్కుతున్న గోపాల గోపాల పై అంచనాలు పెరిగాయి.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో నటించడంతో అంచనాలు మరింత పీక్స్ కి వెళ్లాయి.. ఈ సినిమాకు అనురూబ్ అందించిన మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. దీనికి కారణం సినిమా సేమ్ టూ సేమ్ ఓ మై గాడ్ లా ఉండటం.. అలాగే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడంతో సినిమా బాగున్నా కూడా ఫ్యాన్స్ లో ఏదో నిరాశ.. అయితే దేవుడిలా పవన్ ఎంట్రీ మాత్రం అదిరిపోతుంది.. ఒరిజినల్ మూవీ కంటే కూడ పవన్ పాత్ర అద్భుతంగా ఉంటుంది.. ఈ విషయంలో దర్శకుడు కిషోర్ పార్ధసాని (డాలి) సక్సెస్ అయ్యాడు.. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి..పవన్, వెంకటేష్ కలిసి నటించడంతో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: