ప్రస్తుతం మెగా అభిమానులకి, అల్లు వారి అభిమానులకి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉంది. ఇక అల్లు అర్జున్ అభిమానులకు నందమూరి అభిమానుల అండ ఉండనే ఉంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సదరు వ్యాఖ్యలను గమనించిన ఆపోజిట్ గ్యాంగ్, ఆ మాటల వెనుక అంతరార్థం తెలుసుకోకుండా పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక నాగబాబు గురించి అందరికీ తెలిసిందే.

నాగబాబు మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ, తనకంటూ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు. మొదట ఎన్నో సినిమాలలో నటించిన నాగబాబు, ఆ తరువాత కాలంలో వారి తల్లి అంజనాదేవి పేరిట కొన్ని సినిమాలను నిర్మించి, నిర్మాతగా కూడా మారారు. ఆ తర్వాత ఆయన పలు బుల్లితెర సోషల్ లో కూడా మెరిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన పలు విషయాల పైన అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పైన నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే దానికి కారణం లేకపోలేదు. ఆయా హీరోల నెగెటివిటీ గురించి నాగబాబు చెబుతూనే వాళ్లు ఎదిగిన తీరని నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయం అర్థం కాని మూర్ఖ అభిమానులు సోషల్ మీడియాలో నాగబాబుని ట్రోల్స్ చేస్తున్నారు.

విషయం ఏమిటంటే, ఆయా హీరోల మొదటి సినిమాలు చూసిన నాగబాబుకి, వాళ్లు సినిమా కెరీర్ లో ఇక స్థిరపడరేమో అని అనుమానం కలిగిందట! అయితే వారిని వారు తీర్చిదిద్దుకొని, నటన రంగంలో ఎదిగిన తీరు ఇప్పటి తరానికి ఎంతైనా స్ఫూర్తిదాయకం అని నాగబాబు అభిప్రాయపడ్డారు. నేటి యువతని ఉద్దేశించి నాగబాబు అన్న ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన మాటలపై అనూహ్యంగా నెగెటివిటీ రావడం చాలా దురదృష్టకరమని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోకాల్డ్ హీరోల అభిమానులను ఎమోషనల్ కాకుండా, ముందు ఎదుటి వారు చెప్పే విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: