స్టార్ హీరోయిన్ సమంత గురించి రీసెంట్గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం సృష్టించాయో తెలిసిందే. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కొండా సురేఖ హాట్ కామెంట్ చేయడంతో టాలీవుడ్ మొత్తం ఆమెపై విరుచుకు పడింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం సిని తార‌ల‌ వ్యక్తిగత విషయాల గురించి నిరాధారణమైన ఆరోపణ చేయవుద్దని స్టార్ హీరోలు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. అయితే మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. అలాగే ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు మరోసారి కొండా సురేఖ పై హీరోయిన్ సమంత స్పందించారు.


చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  కానుంది.. ఈ సమయంలోనే తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన్న సమంత.. మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. సౌత్  చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ నటులు తనకు ఎంతో మద్దతు ఇచ్చారో వారందరి సపోర్ట్ కారణంగానే నేనిప్పుడు ఇక్కడ ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.


 “నా గురించి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం నావైపు నిలబడింది. వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. వారి ప్రేమ, సపోర్ట్ కారణంగానే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ఇండస్ట్రీతోపాటు నా ప్రజలు కూడా నన్ను వదులుకోలేదు. వారి ప్రేమ, నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే దీని గురించి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదాన్ని. అందరి మద్దతు వల్లే నేను ఇక్కడ తిరిగి మీ ముందుకు కూర్చున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: