రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రభాస్ , జయంత్ సి పరాంజి దర్శకత్వంలో రూపొందిన ఈశ్వర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి , ప్రభాస్ కి జోడిగా నటించింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి జయంత్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ దర్శకుడు ఈశ్వర్ సినిమా సమయంలో ప్రభాస్ ఎలా ఉండేవాడు.

మరియు ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఎలా బిహేవ్ చేసేవాడు అనే వాటి గురించి తెలియజేశారు. జయంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు చేయడంలోనూ ,  మాస్ డైలాగ్స్ చెప్పడంలోనూ , కామెడీ సన్నివేశాల్లో నటించడంలోనూ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. కాకపోతే రొమాంటిక్ సన్నివేశాలు వచ్చాయి అంటే చాలు భయపడేవాడు. రొమాంటిక్ సన్నివేశం ఉంది అంటే హీరోయిన్ తో మాట్లాడడానికే భయపడేవాడు.

ఇక కొన్ని సార్లు మేము శ్రీదేవి నే కాస్త ముందుకు వెళ్లి అతనితో క్లోజ్ గా నటించు అనేవాళ్ళం. కానీ అందుకు కూడా పెద్ద స్కోప్ ఉండేది కాదు. ఎందుకంటే ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర చాలా ఇన్నోసెంట్. అలా ముందుకు వెళితే ఆ పాత్ర స్కోప్ తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత ప్రభాస్ తో నీకు లవర్ లు లేరా ..? నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు ..? బయటికి వెళ్లి నువ్వు అమ్మాయిలతో కాస్త సమయాన్ని గడుపు అని చెప్పేవాళ్లం అని జయంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: