మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అదిరిపోయే రేంజ్ విజయాలను అందించిన దర్శకుడు , నిర్మాతలలో మంచి స్థానాలలో రాఘవేంద్రరావు , అశ్విని దత్ ఉంటారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 14 సినిమాలలో చిరంజీవి నటించాడు. అందులో రెండు సినిమాలను మినహాయిస్తే మిలిగిన 12 సినిమాలలో చిరంజీవి సోలో హీరోగా నటించాడు. ఇందులో చాలా మూవీ లు విజయాలను అందుకున్నాయి. కొన్ని మూవీ లు ఏకంగా ఇండస్ట్రీ హిట్ లను కూడా అందుకున్నాయి. ఇక అశ్విని దత్ బ్యానర్లో చిరంజీవి 4 సినిమాలలో నటించాడు. అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి , ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలవగా , చూడాలని ఉంది మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

జై చిరంజీవ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం చిరంజీవి హీరోగా రాఘవేందర్రావు దర్శకత్వంలో అశ్విని దత్ ఓ సినిమాను సెట్ చేశాడట. కథ మొత్తం పూర్తి అయ్యాక కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ సినిమాలో నటించను అన్నాడట. ఆ సినిమా ఏది ..? అది ఎవరితో రూపొందింది అనే వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం నాగర్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాణంలో ఆఖరి పోరాటం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాను మొదట చిరంజీవి హీరోగా రూపొందించాలి అని రాఘవేంద్రరావు , అశ్విని దత్ అనుకున్నారట.

కానీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల చిరంజీవి ఆ సినిమాను చేయలేదట. దానితో నాగార్జున తో ఈ మూవీ ని చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లోని నాగార్జున , శ్రీదేవి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: