సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత విషయాలను కూడా పదే పదే మాట్లాడుకోవడం ట్రోల్ చేయడం సర్వసాధారణంగా అయిపోయింది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత విషయాల గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . అదేవిధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ హాట్ గా వైరల్ అవుతుంది. అది కూడా హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన వార్త కావడంతో జనాలు ఆ వార్త గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


మచ్చలేని చందమామగా నెగిటివ్ కామెంట్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సాయి పల్లవి పై ఏదైనా బ్యాడ్ రూమర్ సర్కులేట్ అవుతుంది అంటే మాత్రం అది కచ్చితంగా ఇదే అని చెప్పాలి . సాయి పల్లవి కారణంగానే ఇద్దరు స్టార్ హీరోల జీవితాలు నాశనం అయిపోయాయి అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . నాగచైతన్య - సాయి పల్లవి కలిసి నటించిన సినిమా "లవ్ స్టోరీ" . శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే నాగచైతన్య - సమంతకు విడాకులు ఇచ్చేశారు .



అదే విధంగా ధనుష్ కూడా సాయి పల్లవి తో నటించిన మారి 2 సినిమా తర్వాతనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు.  పరోక్షకంగా ఈ రెండు ఒకేసారి సాయిపల్లవి సినిమాలకు కో ఇన్సిడెంట్ అవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే సాయి పల్లవి బ్యాడ్ లక్ కారణంగానే ఇద్దరు జీవితాలు ఇలా అయిపోయాయి అంటూ అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు హీరో కూడా స్టార్ పొజిషన్లో ఉన్నారు . ఒకప్పుడు నాగచైతన్య అంటే పెద్ద విలువ ఇచ్చే వాళ్లే కాదు . కానీ ఇప్పుడు ఆయనకి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ప్రజెంట్ వీళ్ళిద్దరూ కలిసి తండేల్ సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారు.  ఈ సినిమా హిట్ అయితే ఇక నాగచైతన్యకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదు అంటున్నారు అక్కినేని అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: