నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నారు. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా కూడా రానుంది. ఇక నిన్నే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్ షోకు బాలయ్య హోస్టుగా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బాలయ్య హోస్ట్గా అన్ స్టాపబుల్  షో ఆహాలో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇక  నాలుగో సీజన్ కు అంత సిద్ధమవుతుంది. అహలో  ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోలతో బాలయ్య అదరగొట్టాడు.


బాలయ్య సెలబ్రిటీలను తికమక పెట్టే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి అతిధులను డైలమాలో పడేస్తున్నారు. ఇక గత సీజన్లో ఈ షోకి బాలీవుడ్ స్టార్స్‌ కూడా వచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ,మహేష్, అల్లు అర్జున్, సురేష్ బాబు, కీరవాణి, బ్రహ్మానందం. విజయ్ దేవరకొండ ఇలా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ వంటి వారు పెద్దగా బయట షోలకు హాజరవురు కానీ బాలయ్య షోకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కూడా ఈ షోలో మెరిశారు. ఇప్పుడు వచ్చే సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆహాలో ఈ సీజన్ కు సంబంధించిన మొదటి ప్రోమోను కూడా విడుదల చేశారు. అయితే ఈ సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి మొదటి అతిథిగా రాబోతున్నారని కూడా అంటున్నారు.


బాలయ్య - చిరంజీవి మధ్య గత నాలుగు దశాబ్దాలుగా గట్టి పోటీ ఉన్నప్పటికీ ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి బాలయ్య చిరంజీవిని ఈ షోకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. అలాగే ఈసారి పుష్ప2  ప్రేక్షకులు ముందుకు రానుంది. అల్లు అర్జున్ - సుకుమార్ కూడా మరోసారిఈ షోకు రావచ్చు అని కూడా అంటున్నారు. అదేవిధంగా సమంత కూడా వచ్చే అవకాశం ఉంది. సమంత ఇంతవరకు ఈ షోకు హాజరు కాలేదు కాబట్టి ఆమెను ఈసారి తీసుకురానున్నారని టాక్. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా వస్తుందని టాక్. మరో విశేషమేమిటంటే హీరోగా మారబోతున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా వస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఈ షోకి మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా రాబోతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: