తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రమా ప్రభ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో పాత్రలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంది. రమాప్రభ చేయని పాత్ర అంటూ ఏమీ లేదు.. ఎలాంటి పాత్రలోనైనా సరే తనకు తానే సాటి అన్నట్లుగా ఉంటుంది. అప్పట్లో కొంతమంది చిత్రాలలో ఏమైనా సెంటిమెంట్ గా కూడా నటింప చేసేవారట. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ సినిమాలో కనిపించలేదు రమా ప్రభ.. తాజాగా ఇప్పుడు రమా ప్రభ ఇంట  విషాద ఛాయలు ఏర్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


రమా ప్రభ సోదరి కుమారుడు సురేష్ అకస్మాత్తుగా మరణించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు మరణ వార్త విన్న తర్వాత రాజేంద్రప్రసాద్ను పరామర్శించడానికి వెళ్లిన రమా ప్రభ , ఈమె సోదరి కుమారుడు సురేష్ అక్కడికి వెళ్లారట.. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కూతురు సంబంధించి 11 రోజుల కార్యక్రమంలో కూడా రమా ప్రభ సోదరుడు సురేష్ పాల్గొన్నారు జరిగిందట. ఆ సమయంలో సురేష్  తీవ్ర అస్వస్థకు కూడా గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి సురేష్ ను తీసుకువెళ్లారట. అక్కడ గత కొద్దిరోజులుగా వైద్యం అందిస్తున్న ఫలితం దక్కలేదని సమాచారం.


అయితే సురేష్ మాత్రం గత కొన్ని నెలలుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. రమా ప్రభ  నిర్మాణ సంస్థలు వచ్చిన అప్పుల అప్పారావు సినిమాకి సైతం సురేష్ నిర్మాతగా వ్యవహరించారట.. పొలిటికల్ పరంగా కూడా మదనపల్లిలో సురేష్ బాగా ఎదిగారని సమాచారం. కానీ చిన్నవయసులోనే సురేష్ మరణించడంతో ఒక్కసారిగా రమా ప్రభ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అటు మదనపల్లిలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రమా ప్రభ కి మాత్రం అభిమానులు కాస్త ధైర్యాన్ని ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: