టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్  సినిమాతో బంపర్ హిట్ అందుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది అగర్వాల్. కానీ నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది నిధి అగర్వాల్.

 అయితే మొదటి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్ అయిన నిధి అగర్వాల్... ఆ తర్వాత పెద్ద హీరోలతోనే సినిమాలతో చేసింది. ముఖ్యంగా అక్కినేని అఖిల్ హీరోగా చేసిన మజ్ను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఈ తరుణంలోనే  ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత గల్లా అశోక్ చేసిన సినిమాలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. గల్లా అశోక్ మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమానే హీరో.

 
ఇక ప్రస్తుతం బడా  హీరోల సినిమాలలో చేస్తోంది నిధి అగర్వాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో...  ఇప్పటికే ఫైనలై షూటింగ్లో కూడా పాల్గొంటుంది నిధి అగర్వాల్. అటు ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నే ఉంది. మారుతి అలాగే ప్రభాస్ కాంబినేషన్లో రాజా సాబ్ వస్తోంది. అయితే ఈ రెండు సినిమాల గురించి తాజాగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్ట్ పెట్టింది.

 
నేను రెండు పాన్ ఇండియా సినిమాలలో చేస్తున్నాను. ఈ రెండు కూడా ఒకటి ప్రభాస్ ది... అయితే మరొకటి పవన్ కళ్యాణ్ ది  అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్లలో ఒకే రోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ పెట్టింది. అది కూడా  ఉదయం ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేస్తే... సాయంత్రం తెలంగాణలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ రెండు బడా హీరోల సినిమాలు బంపర్ హిట్ అవుతాయని ఆమె పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: