టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మహానటి సినిమాతో తన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. కీర్తి సురేష్ హీరోయిన్ కావడానికి తన కుటుంబమే ప్రత్యేకమైన కారణం.


కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈ భామకు మంచి ప్రోత్సాహం లభించింది. తర్వాత మలయాళంలో "ఇదు ఎన్నమాయమ్" సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ సినిమా నేను శైలజ. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటించి తన అమాయకమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది.


ఆ సినిమాలో తనకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ బ్యూటీ కెరియర్ విషయానికి వస్తే.... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. రివాల్వర్ రీటా, బేబీ జాన్ వంటి సినిమాలు త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరువలో ఉండే కీర్తి సురేష్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటుంది.

ఇదంతా పక్కకు పెడితే.. టాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లికి రెడీ అయ్యారట. ఇంట్లో పెద్దలు ఒప్పించిన పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. అది కూడా ఓ బడా వ్యాపార వేత్తతో టాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లికి రెడీ అయ్యారని అంటున్నారు. అతి త్వరలోనే టాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి జరుగనుందట. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రానుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: