టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్న సాయికుమార్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫస్ట్ టైం అప్పటి స్టార్ హీరోలయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’ అనే సినిమాకి డబ్బింగ్ అందించారు. ఆ తర్వాత బాల నటుడిగా అవకాశం అందుకుని ‘దేవుడు చేసిన పెళ్లి’ అనే మూవీలో అంధుడి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత కన్నడ చిత్రాలలో హీరోగా నటించారు. కానీ, ఈయన తెలుగు చిత్రాలతోనే ఫేమ్ తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే.. సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయే ఫ్యామిలీలలో సాయికుమార్ కుటుంబం కూడా ఒకటి అని చెప్పాలి. ఈ క్రమంలో సాయి కుమార్ కుమార్తె చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి కుమార్ కూతురు జ్యోతిర్మయి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో మా బాబాయ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయాము.. ఒకానొక సమయంలో మా బాబాయ్ ఈశ్వర్ అల్లా అనే సినిమా తీశారు. సొంత బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్క సినిమాతో ఫైనాన్షియల్ గా మా కుటుంబం రోడ్డుకి ఎక్కింది.అయితే ఆ సమయంలో మా అమ్మే ఫైటర్ గా మారి ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేసింది. దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అటు డిస్టర్బ్యూటర్స్ తో ఇటు ఫైనాన్షియర్ తో అమ్మ మాట్లాడిన తీరుకి వారు అమ్మను నమ్మి , మాకు కాస్త టైం ఇచ్చారు. ఇక ఆ అప్పులు తీర్చడానికి నాన్న ఎంతో కష్టపడ్డారు.. నాన్న అక్కడ నటించడం, ఆ డబ్బు తీసుకొచ్చి అప్పులు తీర్చడం ఇలా దాదాపు మూడు సంవత్సరాల కష్టం తర్వాత మళ్లీ మేము బయటపడ్డాము. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు మాకే రోజు కూడా మా తల్లిదండ్రులు తెలియనివ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. జ్యోతిర్మయి. ప్రస్తుతం సాయికుమార్ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇదిలావుండగా ఇక ఆ సమయంలో అటు మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల నుంచి మీకు ఎటువంటి సహాయం లభించలేదా అని యాంకర్ అడుగగా..

దీనికి స్పందిస్తూ.. ‘ఇండస్ట్రీలో సహాయం చేస్తామని చెబుతారే కానీ ఎవరు మాకు సహాయపడలేదు. ఆ సమయంలో ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. పైగా మమ్మల్ని పట్టించుకున్న నాథుడు కూడా లేడు’ అంటూ జ్యోతిర్మయి సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలను ఉద్దేశిస్తునే జ్యోతిర్మయి ఇన్ డైరెక్ట్‌గా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: