ప్రేక్షకులు అందరినీ అలరించి అతిపెద్ద రియాల్టీ షోగా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్గా వెళ్లే సెలబ్రిటీలకు ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ రూల్స్ ఏంటి అన్న విషయాన్ని హౌస్ లోకి అడుగుపెట్టే ముందే అందరికీ క్లారిటీగా చెప్పేస్తుంటారు. ఇక ఇలాంటి రూల్స్ ని ఎవరైనా అతిక్రమిస్తే వారిని హౌస్ నుంచి బయటికి పంపించడం లేదంటే నాగార్జున వారాంతంలో వచ్చి ఇంకోసారి అలా చేయకు అని మందలించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 చాలావరకు అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో కులాలు, మతాల గురించి ఇప్పటివరకు ఎప్పుడు పెద్దగా డిస్కర్షన్ జరగలేదు. ఒకవేళ వచ్చిన ప్రేక్షకులకు చూపించారా లేదా అన్నది మాత్రం తెలియదు. కానీ మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి చర్చ రావడం సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల బిగ్ బాస్ లో కమ్యూనిటీ గురించి మహబూబ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. తమ కమ్యూనిటీ ఓట్లన్నీ నీకు లేదా నాకే పడతాయి అంటూ నబీల్ తో  మహబూబ్ చెప్పుకొచ్చాడు  అయితే ఇది అస్సలు కరెక్ట్ కాదు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.


 ఈ సీజన్లో నభీల్ ముందుగా కంటెస్టెంట్గా ఎంట్రీ.. ఇస్తే వైల్డ్ కార్డు ద్వారా మహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు ఒకే కమ్యూనిటీకి చెందినవారు. అయితే ఇటీవల అటు మహబూబ్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. కమ్యూనిటీ, క్యాస్ట్ చూసి ఓట్లు వేసే లాగా కనిపిస్తున్నామా అంటూ మహబూబ్ ని బయట సోషల్ మీడియాలో తెగ తిట్టిపోస్తున్నారు. అయితే ఇక నబీల్, మహబూబ్ మధ్య జరిగిన డిస్కషన్ గురించి అటు వారాంతంలో నాగార్జున కూడా తెరమీదికి తెచ్చాడట. ఈ క్రమంలోనే మెహబూబ్ కు రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుంచి బయటికి పంపించేస్తారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. గతంలో అభయ్ నవీన్ బిగ్ బాస్ ను తిట్టడంతో అతనికి రెడ్ కార్డు చూపించాడు నాగార్జున. ఇక ఇప్పుడు రూల్స్ అతిక్రమించినందుకు గాను మహబూబ్ కి కూడా ఇలా రెడ్ కార్డు చూపించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: