తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే 7 సీజన్ ల పాటు ప్రేక్షకులను అలరించి టాప్ రేటింగ్స్ సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం.. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రారంభం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో ఎప్పటిలాగానే నామినేషన్స్ ఎలిమినేషన్స్ చర్చ కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే మునిపెన్నడూ లేనివిధంగా ఏకంగా 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ షో రేటింగ్ కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన వారందరూ కూడా ఇక బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టే రూల్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎవరు కూడా బయట కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు. అంతేకాకుండా బిగ్బాస్ పారితోషకం ఎంత అన్న విషయాన్ని కూడా అస్సలు చెప్పకూడదు. దీంతో పాటు బిగ్ బాస్ పెట్టే అన్ని రూల్స్ ని పాటించాలి. ఎవరైనా రూల్ అతిక్రమించారు అంటే వారిపై కఠిన చర్యలు తప్పవు. అయితే ఇటీవలే బిగ్ బాస్ లో నబీల్, మహబూబ్ ఏకంగా కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి అంటూ మాట్లాడుకున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.



 అదే సమయంలో రెమ్యూనరేషన్ గురించి బయటకు చెప్పకూడదు అనే రూల్ ని బ్రేక్ చేసేసాడు మణికంఠ. బిగ్బాస్ హౌస్ లో గంగవ్వ, హరితేజ, నబిల్, పృథ్వి, మణికంఠ ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో.. మణికంఠ మధ్యలో కలుగజేసుకొని వారానికి నాకు వచ్చేది కేవలం లక్ష.. ఏం సరిపోతుంది అంటూ నోరు జారాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు  అయితే ఇలా హౌస్ లో రూల్స్ ని బ్రేక్ చేస్తూ చాలా సంఘటనలు జరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా వ్యవహరించిన కంటెస్టెంట్స్ పట్ల నాగార్జున రియాక్షన్ ఎలా ఉంటుందో వారాంతంలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: