ఇది నిజంగా సాయి పల్లవి అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్ అనే చెప్పాలి . అసలు సాయి పల్లవి అంటేనే మంచితనం.  మంచితనం అంటేనే సాయి పల్లవి.  పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా సాయి పల్లవిని అభివర్ణిస్తూ ఉంటారు అభిమానులు . అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా సాయి పల్లవిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . బాలీవుడ్ లో సాయి పల్లవి - రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే .


అయితే ఇక్కడే ఆమె నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కించుకుంది . సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక తన పద్ధతులు మార్చుకోవాల్సిందే . బోల్డ్ రోల్స్ , లిప్ లాక్ సీన్స్ చేయాల్సిందే . పార్టీలకి పబ్బులకి అటెండ్ అవ్వాల్సిందే. అది బాలీవుడ్ కల్చర్ . అయితే చాలామంది హీరోయిన్స్ కూడా అదే విధంగా మారిపోయిన  పరిస్థితి మనం చూశాం. తమన్నా - తాప్సి - పూజ హెగ్డే -రష్మిక మందన్నా - కీర్తి సురేష్ లాంటి వాళ్ళు కూడా బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడిపోయారు.



బాలీవుడ్ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. అయితే సాయి పల్లవి మాత్రం అందుకు విభిన్నంగా ప్రవర్తిస్తుంది . ఆమె బాలీవుడ్ లో సినిమాలో అయితే నటిస్తుంది కానీ బాలీవుడ్ కల్చర్ ని ఏం మాత్రం ఫాలో అవ్వడం లేదు . పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం.  అదేవిధంగా ఎంత హద్దుల్లో ఉండాలో అదే విధంగా ఉండడం మాత్రమే చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఒక బడా పార్టీకి సాయి పల్లవికి కూడా ఇన్విటేషన్ అందింది. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు హాజరు అవ్వలేదు. దానికి కారణం సాయి పల్లవికి అలాంటి పార్టీలు ఇష్టం లేకపోవడం . దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు . మా సాయి పల్లవి అక్కడున్న ..ఇక్కడున్న ..ఎక్కడున్న సరే పద్ధతికి కేరాఫ్ అడ్రస్సే. ఆమె కాళ్ళకు దండం పెట్టినా తప్పులేదు. నిజంగా  సావిత్రి గారి అంత మహానటి అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: