టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. మొదటిసారి ఏం మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. గత కొన్ని నెలలుగా సమంత మయూసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది సమంత.


ప్రస్తుతం సీటాడెల్.. (హనీ బన్నీ) అనే వెబ్ సిరీస్ లో నటించిన సమంత ప్రమోషన్స్లో పాల్గొని బిజీగా ఉన్నది. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అవ్వగా సమంత నటన అద్భుతంగా ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంటర్వ్యూ లోనే సమంత మాట్లాడుతూ తనకు మయోసైటీస్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా తాను అంతా మరిచిపోయానని తనకు మతిమరుపు అనే వ్యాధి వచ్చినట్లుగా ఇబ్బంది పడ్డారని తెలియజేసింది. ముఖ్యంగా తనని ఎవరు హాస్పిటల్ కి తీసుకు వెళ్లలేదు అలాగే తన హెల్త్ గురించి కూడా ఎవరు అడగలేదు అనుకుంటానని విధంగా అనుకునే దాన్ని అంటూ తెలిపింది. కానీ తన సినిమాలు సెట్స్ మీదికి కొన్ని ఉండేవి ఆ సమయంలో నిర్మాతలు తన షూటింగ్ కోసం వెయిట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది సమంత.


అయితే ఈ విషయాలు విన్న అభిమానుల సైతం కాస్త షాక్ గురయ్యారు. దీంతో అభిమానులు సైతం సినిమాలకంటే ఆరోగ్యమే ముఖ్యం అంటు సలహా ఇస్తున్నారు.. మొత్తానికి సమంత తను ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం మరొకసారి గుర్తు చేస్తే అభిమానులను ఆందోళన కలిగించేలా చేస్తోంది. మరి రాబోయే రోజుల్లోనైనా సమంత పూర్తిగా ఆరోగ్యంతో కోలుకొని మరి సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సమంత తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: