చాలా ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకుల వ్యవహారం ఇప్పుడు రొటీన్ గా మారిపోయింది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు ఎన్నో ఏళ్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని మరొక వివాహం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో అటు సమంత, నాగచైతన్య, కోలీవుడ్ లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్, జయం రవి, ఆర్తి వీరే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో సంచనలంగా మారింది.




ఈ విషయం తెగ రచ్చ చేస్తూ ఉండడంతో అభిమానులు ఈ విషయం విని షాక్ అవుతున్నారు.. 2012లో ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈ జంట వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సైఫ్ తన చేతికి వేసుకున్న కరీనాకపూర్ టాటూ అని తొలగించినప్పటి నుంచి పలు రకాల అనుమానాలు మొదలవుతున్నాయట. దీంతో కచ్చితంగా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.


కరీనా కపూర్ కూడా ఇప్పుడు ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఉండడంతో పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సైఫ్ మూడో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారింది ఈ వ్యవహారం. 1991లో సైఫ్ మొదటిసారి అమృత సింగ్ ను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆ తర్వాత మళ్లీ 2004లో వీరు విడిపోగా కరీనాకపూర్ ని ప్రేమించి మళ్లీ రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రెండో భార్యకు కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. ప్రస్తుతం మూడో పెళ్లి పై సైడ్ ఎక్కువ దృష్టి పెడుతున్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: