తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు. మళ్ళీ వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఇక అప్పటి నుండి వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిషమూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి కోసం ఓ బాలీవుడ్ స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఓ సినిమాలో నటించాడట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో సల్మాన్ పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ ఈ మూవీ విజయంలో ఈయన రోల్ కీలకమైన పాత్రను పోషించింది. ఇకపోతే ఈ సినిమాలో నటించడం కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం చిరంజీవి ఫ్రెండ్షిప్ కోసమే ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. ఇలా సల్మాన్ , చిరంజీవి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలో గాడ్ ఫాదర్ మూవీ లో నటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: