టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . నాగార్జున తన కెరీర్లో కొన్ని రీమిక్ సినిమాలలో కూడా హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఇది ఇలా ఉంటే ఒక రీమిక్ సినిమాను ఒక దర్శకుడి తో నాగార్జున చేయాలి అనుకున్నాడ ట అందులో భాగంగా ఆ దర్శకుడిని సంప్రదించాడట . ఆయన మాత్రం ఆ సమయం లో అది కుదరదు అని చెప్పడంతో వేరే దర్శకుడి తో అదే సినిమాను రీమిక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడట. అసలు ఆ సినిమా ఏది .? ఆ దర్శకుడు ఎవరు .? అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా నగ్మా హీరోయిన్గా ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వారసుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇది ఒక రీమిక్ సినిమా. ఇక ఈ సినిమాను నాగార్జున మొదటగా బి గోపాల్ దర్శకత్వంలో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా గోపాల్ ను సంప్రదించి విషయం మొత్తం చెప్పాడట. ఇక గోపాల్ కి కూడా నాగార్జున తో సినిమా చేయాలి అని ఉందట. కాకపోతే ఆ సమయంలో అతను చాలా సినిమాలకు కమిట్ అయి ఉండడంతో చేయలేను అని చెప్పాడట. దానితో ఏమీ చేయలేని నాగార్జునసినిమా రీమిక్ దర్శకత్వ ఈ వీ వీ సత్యనారాయణ కు అప్పగించాడట. ఆ తర్వాత వారసుడు అనే టైటిల్ తో రీమేక్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: