టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీమణులలో శృతి హాసన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. దానితో ఈమెకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. అలాంటి సమయంలో ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈమె క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఈ నటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని వాటిలో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

ఇకపోతే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. మొదటగా పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది.  ఆఖరుగా పోయిన సంవత్సరం ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా పోయిన సంవత్సరం ఏకంగా నాలుగు బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు మాత్రం పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవి విడుదల కాలేదు. మరి ఈ సంవత్సరం ఎండింగ్ వరకైనా ఈ బ్యూటీ నటించిన ఏదైనా సినిమా థియేటర్లలో విడుదల అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: