చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆపద్బాంధవుడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి చిరంజీవి కి జోడిగా నటించింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఢిల్లీలో చదువుకున్న ఈమె చదువును కొనసాగిస్తున్న సమయం లోనే మిస్ ఇండియా పోటీల్లో సెలెక్ట్ అయింది. ఇక ఆ తర్వాత మోడల్ గా వరుస పెట్టి ఛాన్సులు రావడంతో మోడలింగ్ రంగం లో ఈమె టాప్ ప్లేస్ కు వెళ్ళింది. అలా మడలింగ్ రంగం లో అద్భుతమైన స్థాయిలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బ్యూటీ చాలా బాలీవుడ్ సినిమాలలో నటించింది. అమితా బచ్చన్ , అనిల్ కపూర్ , రాజేష్ కన్నా , సన్నీ డియోల్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి హిందీ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇకపోతే తెలుగు లో ఈమె చిరంజీవి హీరోగా రూపొందిన ఆపద్బాంధవుడు సినిమాలో హీరోయిన్గా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాలకు దూరం అయ్యి చాలా కాలమే అవుతున్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇలా మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: