టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో... కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వస్తే... మరి కొంతమంది తెలుగువారు రాణిస్తున్నారు. అలా రాణించే వారిలో... కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తుంటే... మరి కొంతమంది అట్టర్ ప్లాప్ అవుతున్నారు. అలాగే మరికొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోతున్నారు. అయితే... అప్పట్లో స్టార్ హీరోయిన్గా మెరిసి... తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.

అలాంటి వారిలో హీరోయిన్ సౌందర్య ఒకరు. హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి సావిత్రి తరహాలో... టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలింది సౌందర్య. దాదాపు 20 సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో... తన హవా నడిచింది. వెంకటేష్, చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున ఇలాంటి హీరోల సరసన... చాలా సినిమాలు చేసింది హీరోయిన్ సౌందర్య. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నప్పుడే.. ఆమె మరణించారు.

ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్... బ్లాస్ట్ కావడంతో... సౌందర్యం మరణించడం జరిగింది. ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తు చేసుకొని తెలుగు ప్రేక్షకులు... ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఆమె మరణం పై తాజాగా ఓ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు అనుమతి ఇవ్వకుండా ఉంటే సౌందర్య బతికే వారని..శివశంకర్ సినిమా దర్శకుడు రాజేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌందర్య అలాగే మోహన్ బాబు జంటగా నటించిన సినిమా శివశంకర్. ఈ సినిమాకు దర్శకుడిగా రాజేంద్ర పని చేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సౌందర్య మరణించడం జరిగింది.


అయితే దీనిపై దర్శకుడు రాజేంద్ర మాట్లాడుతూ.... షూటింగ్ సమయంలో నిర్మాత మోహన్ బాబు ఎవరికీ  కూడా హాలిడేస్ ఇచ్చేవాడు కాదని.. కానీ కేవలం సౌందర్యకు మాత్రం ప్రత్యేకంగా... అనుమతి ఇచ్చారని వివరించాడు. ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో సౌందర్యకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు దర్శకుడు రాజేంద్ర. అదే సమయంలో ఆమె మరణించింది అని కూడా తెలిపాడు. ఇక సౌందర్య మరణించడంతో సినిమా సరిగా షూటింగ్ చేయలేక... శివశంకర్ ఫ్లాఫ్ అయిందని కూడా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: