టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్యలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ హీరోలుగానే కెరీర్ ను కొనసాగించడంతో పాటు అదే సమయంలో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదనే సంగతి తెలిసిందే.
 
చిరంజీవి, బాలయ్య కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చిరు, బాలయ్య కాంబో మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఈ కాంబో మూవీకి దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ కాంబో మూవీకి వారిద్దరే అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
 
వైరల్ అవుతున్న వార్త నిజమై అధికారికంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే మాత్రం మెగా నందమూరి అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు. చిరంజివి, బాలయ్య కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఇద్దరు హీరోలను వెండితెరపై చూడటానికి రెండు కళ్లు చాలవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరు, బాలయ్య ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
 
బాలయ్య తర్వాత మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. మరోవైపు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ గురించి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. మోక్షజ్ఞ యాక్టింగ్ ను తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ హీరో బాలయ్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా ఏడాదికి ఒక సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి సైతం విశ్వంభర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిరు విశ్వంభర సినిమా బడ్జెట్ పరంగా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: