కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10 వ తేదీన భారీ ఎత్తున మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ భారీ ఎత్తున కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోతుంది. కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేట అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని మాస్ యాక్షన్ సన్నివేశాలకు రజిని అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ మాట్లాడుతూ ... కార్తీక్ సుబ్బరాజు పేట సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన జిగర్ దండ 2 , మహాన్ సినిమాలకు సంబంధించిన కథలను చిన్న పాయింట్ గా వివరించాడు. అవి నాకు బాగా నచ్చాయి. కానీ సినిమా విడుదల అయ్యాక అవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి అనిపించింది.

ఆయన నాకు పూర్తి కథను చెప్పలేదు అని రజనీ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులతో పాటు ఇండియా వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: