నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక గతంలో మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. అలాగే వచ్చే నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుందిని అంటున్నారు. అయితే ఇక్కడ మోక్షజ్ఞతో చేయ‌బోయే సినిమాని కూడా ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెర‌కెక్కించబోతున్నాడు. అలాగే ఈ కథ కూడా మహాభారతం చుట్టూ తిరుగుతుందని.. అలాగే మోక్షజ్ఞ క్యారెక్టర్ అభిమన్యుడు పాత్రకు దగ్గరగా ఉంటుందని.. ఈ సినిమాలో బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారని కూడా అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకొచ్చింది.. అసలు విషయంలోకి వెళితే మోక్షజ్ఞ సినిమా కోసం మెగా ఫ్యామిలీ కూడా బాలయ్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతుందట. అంతే కాకుండా ఈ సినిమాకు రామ్ చరణ్  నిర్మాతగా ఉండాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే చరణ్ , బాలయ్య తో చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి రామ్ చరణ్ కూడా మోక్షజ్ఞ సినిమాకు నిర్మాతగా రావొచ్చని అంటున్నారు.


అలాగే ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ తో మూవీ ప్రారంభమవుతుంది అని కూడా అంటున్నారు. ఇప్పటికే మెగా - నందమూరి హీరోలు ఈ మధ్యకాలంలో ఎలా కలుసుకుంటున్నారు అందరికీ తెలిసిందే. అలాగే బాలయ్య 50 సంవత్సరాల వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అదే సమయంలో బాలయ్య - చిరంజీవి కలిసి ఒక సినిమాలో నటిస్తామని కూడా చిరు ప్రకటించారు. ఇలాంటి సమయంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాకు మెగా ఫ్యామిలీ నిర్మాతగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. మరి దీనిపై త్వరలోనే అధికార ప్ర‌క‌ట‌న‌ కూడా రానందుని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: