శ్రీదేవి జీవితమే ఒక పెద్ద నరకం లాంటిది.. ఆమె తన జీవితంలో నరకానికి దగ్గరగా వెళ్ళిన ఎన్నో సంఘటనలను చూసి వచ్చిందని ఈమె జీవితాన్ని దగ్గర నుండి చూసిన ఎంతోమంది అంటూ ఉంటారు. ఎందుకంటే రెండో పెళ్లి వాడైన బోనీ కపూర్ ని చేసుకుని శ్రీదేవి ఏనాడు సుఖపడలేదు. ఇక శ్రీదేవి సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోనే బోనీ కపూర్ కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేసేవాడనే టాక్ కూడా బాలీవుడ్ లో వినిపించింది. బోనీ కపూర్ శ్రీదేవి డబ్బులు చాలా వాడుకొని పోగొట్టారనే టాక్ కూడా వినిపించింది. అయితే భార్యాభర్త ల మధ్య డబ్బు విషయం కామన్. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవి ఇద్దరు కూతుళ్లకు ఆస్తులు ఏవి మిగిల్చకుండా చేశారని అంటూ ఉంటారు. ముఖ్యంగా బోని కపూర్ ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ ముగ్గురు కారణంగా బతికుండగానే నరకమనుభవించింది. పట్టపగలే చుక్కలు చూసేంతలా టార్చర్ చేశారట.. మరి శ్రీదేవి ఎవరి వల్ల నరకం అనుభవించింది అనేది చూస్తే.. అందాల తార శ్రీదేవి బోనీ కపూర్ మొదటి భార్య,మొదటి భార్యకు పుట్టిన కొడుకు అర్జున్ కపూర్,బోని కపూర్ తల్లి ఈ ముగ్గురి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడిందట. 

ముఖ్యంగా బోనీకపూర్ తల్లి  శ్రీదేవిని అందరి ముందే చెప్పుతో కొట్టి అవమానించింది అని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి. అలాగే బోనీ కపూర్ మొదటి భార్య కూడా తనకి అన్యాయం చేసినందుకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడమే కాదు ఎన్నో శాపనార్థాలు కూడా పెట్టిందట. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో కూడా శ్రీదేవిని బోనీ కపూర్ మొదటి భార్య కడుపులో తన్నింది అనే టాక్ కూడా బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపించింది.. ఇక బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు నటుడు అర్జున్ కపూర్  సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేస్తానని చెప్పి శ్రీదేవి దగ్గర ఎన్నో డబ్బులు తీసుకువెళ్లాడట. ఇక డబ్బులు అడిగితే ఇవ్వకుండా శ్రీదేవిని జుట్టు పట్టుకొని ఈడ్చు కొచ్చి మరీ కొట్టేవాడట.

ఇక ఇలాంటి సంఘటనలు ఎన్నో శ్రీదేవి జీవితంలో జరిగాయట.అయితే వాళ్లు చేస్తున్న టార్చర్ గురించి బోనీకపూర్ కు శ్రీదేవి ఎన్నిసార్లు బాధపడుకుంటూ చెప్పినా కూడా పట్టించుకునే వారు కాదట.దాంతో శ్రీదేవి అనవసరంగా రెండో పెళ్లి వాడిని చేసుకున్నాను.ఇంతకంటే నరకం మరొకటి ఉండదు అని ఏడ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయట.కానీ ఎంత బాధ ఉన్నా కూడా లోలోపలే తన బాధను కప్పి పుచ్చుకొని బయటికి మాత్రం ఎంతో అందంగా నవ్వుతూ తిరిగేది ఈ అందాల తార.

మరింత సమాచారం తెలుసుకోండి: