టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బీజం వేసాడు.. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది..తెలుగు సినిమా ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరుకోవడంతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది.. స్టార్ హీరోలందరు ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు.. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మరో ట్రెండ్ కొనసాగుతుంది.. అదే సీక్వెల్స్ ట్రెండ్.. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం మాములే కానీ గత సినిమాకు వున్న క్రేజ్ తో సీక్వెల్ సినిమాను అతి గతి లేని కథతో నింపేసి భారీగా ప్రమోషన్స్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.. ఫస్ట్ పార్ట్ చూసి ఎంతగానో మెచ్చుకున్న ప్రేక్షకుడు సీక్వెల్ కోసం ఎంతో ఆత్రుతగా థియేటర్ కి వెళ్లగా సినిమాలో విషయం లేదని తెలిసి నిరుత్సాహ పడుతున్నాడు.. 

ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందంటే.. సినిమా కథను పూర్తిగా చెప్పకుండా ముందుగానే కథని బాగా ల్యాగ్ చేసి రెండు పార్ట్స్ కింద సిద్ధం చేస్తున్నారు.. ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులకి విసుగు తెప్పించే సీన్స్ అన్నిటిని పెట్టి చివరిలో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలేస్తున్నారు.. దీనితో ప్రేక్షకుడికి అసలు ఏం సినిమాకి వచ్చాం రా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది.. అందుకే దాదాపు ఇలా వచ్చే సినిమాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి.. చంద్రముఖి 2,భారతీయుడు 2, స్కంద వంటి సినిమాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి.. అఖండ, దేవర వంటి సినిమాలు ఆడినా కానీ ప్రేక్షకులు పూర్తి సినిమా చూసాము అనే తృప్తి కలగదు.. దీనితో సగటు ప్రేక్షకుడు ఈ సీక్వెల్స్ మాకొద్దు ఒకేసారి పూర్తి సినిమా వచ్చేలాగా కొత్త కథలు రాయండి అని దర్శకులను వేడుకుంటున్నారు..రెండు పార్ట్స్ పేరుతో సినిమా బిజినెస్ పెరిగితుందే కానీ హిట్స్ మాత్రం రావని ప్రేక్షకులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: