. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

దర్శక‌ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత తన తర్వాత సినిమా ను మహేష్ బాబు తో ప్రకటించాడు .  ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ కూడా రచయిత విజయేంద్రప్రసాద్ పూర్తి చేశాడు .. అలాగే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది . ఇదే సమయంలో మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం తన మేకవర్ ను చేంజ్ చేశాడు .. అలాగే దీపావళి తర్వాత రాజమౌళి తన సినిమా కోసం లుక్క్ టెస్ట్ ను  కూడా కంప్లీట్ చేయనున్నాడు.  


ఇక  ఇదే సమయంలో ఈ సినిమాని జక్కన్న హాలీవుడ్ స్థాయిలో భారీ మల్టీస్టారర్ గా తీసుకురానున్నాడు. అలాగే ఈ సినిమాని కూడా రెండు భాగాలగా వస్తుందని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న‌ సమాచారం . అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ తో హాలీవుడ్ అగ్ర నటులు కూడా నటించబోతున్నారు . అలాగే అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్‌ కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మహేష్ తో పాటుగా ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోని రాజమౌళి ఎంచుకున్నారట.


ఆయన క్యారెక్టర్ కూడా ఎవరు ఊహించిన విధంగా జక్కన్న ప్లాన్ చేయబోతున్నారట. అతను క్యారెక్టర్ తోనే సినిమా మలుపు తిరుగుతుందని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు నట సింహం నందమూరి బాలకృష్ణ .. ఇప్పటి కే బాల‌య్య - మహేష్  మల్టీస్టారర్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి .. ఈ క్రమంలోనే జక్కన్న తన సినిమాల లోనే బాల‌య్య‌నని నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారట . ఇక మరి మహేష్ - జక్కన్న సినిమా లో బాలయ్య నిజంగా నటిస్తే మాత్రం అది బాక్సాఫీస్ కు దబిడి దిబిడే. మరి దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ వస్తుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: