తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఓ సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత జయం , వర్షం , నిజం సినిమాలలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూడు సినిమాలలో కూడా ఈయన తన అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగింది. మళ్లీ ఈయన సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన సినిమాలు ఎన్నో మంచి విజయాలను అందుకున్నాయి.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ కి వరుసగా అపజయాలు దక్కుతున్నాయి. తాజాగా గోపీచంద్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. కావ్య ధాపర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన రెండవ వారం బాక్స్ ఆఫీస్ రన్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఈ బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించి హంగామా చేసింది. ఇక రెండో వారం ఈ సినిమాకు సంబంధించిన 300 థియేటర్లను పెంచుతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి 300 థియేటర్లను ఈ మూవీ బృందం రెండవ వారం పెంచడం వల్ల ఈ సినిమా కలెక్షన్లు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc