నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరో గా టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు .. సీనియర్ హీరోల్లో వ‌రుస‌ విజయాల తో బాలయ్య ఫుల్ స్ప్రింగ్ లో ఉన్నాడు .. అలానే బుల్లితెరపై కూడా మంచి కిక్ ఇస్తున్నాడు. అన్ స్టాపబుల్ షో తో తన లోని కొత్త బాలయ్య ను టాలీవుడ్ కు పరిచయం చేసిన నటసింహం ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసి నాలుగో సీజన్లోకి అడుగు పెట‌బోతున్నాడు . అలాగే అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకుంది.


ఇప్పుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోయే సీజన్ 4తో కూడా బాలయ్య భారీ రచ్చ‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సీజన్లో పాల్గొనే గెస్ట్ ల లిస్ట్ కూడా భారీగానే ఉంది. ఈసారి బాలయ్యతో చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ కూడా బాలయ్యతో గ‌త సీజ‌న్‌లో మంచి హంగామా చేశారు . ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .. చంద్రబాబు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. వీరిద్దరు కూడా మరోసారి ఈ షోలో సందడి చేయడానికి రెడీ అయ్యారు.


అయితే ఇక్కడ ఆహా టీం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుంది .. బాలయ్య షో కి వైసీపీ స్టార్ లీడర్స్ గెస్ట్ లకు వస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నాయకులు ఎవరి అనేది ఇంకా ఆహా టీం క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జగన్ కు అత్యంత ఆప్తులైన నాయకులలో ఇద్దరు బాలయ్య షోకీ తీసుకురాబోతున్నారట. ఇప్పటికే వారితో ఆహా టీం మాట్లాడి ఓకే చేసిందట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఆహా టీం విడుదల చేయనుంది. ఈసారి అన్ స్టాపబుల్ ను గట్టిగానే ప్లాన్ చేశారుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: