పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి తనకి మధ్య గ్యాప్ పెంచారని బండ్ల గణేష్ ఆ మధ్యకాలంలో పరోక్ష కామెంట్లు చేశారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్సినిమా విషయంలో చాలా అన్యాయం చేశారట  ఒకవేళ ఆ పని  చేయకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదట.మరి ఇంతకీ బండ్ల గణేష్ చేసిన తప్పేంటి.. పవన్ ఎలా నష్టపోయారు అనేది ఇప్పుడు చూద్దాం.. జయంత్ సి.పరాంజి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాకి బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా చేశారు. ఇక ఈ మూవీలో కృతికర్బందా. త్రిషలు హీరోయిన్స్ గా చేశారు. కానీ త్రిష కంటే ముందు త్రిష ప్లేస్ లో ఓ బాలీవుడ్ నటిని తీసుకోవాలనుకున్నారట.

 ఆమె ఎవరో కాదు దీపికా పదుకొనే.. తీన్ మార్ మూవీలో దీపిక పదుకొనే పవన్ కళ్యాణ్ పక్కన బాగుంటుంది అని చిత్ర యూనిట్ భావించి దీపిక పదుకొనే దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారట.కానీ బండ్ల గణేష్ చేసిన తప్పు వల్ల దీపిక ఆ సినిమాలో చేయలేదు. ఎందుకంటే ఈ సినిమాని అనుకున్న సమయానికి బండ్ల గణేష్ తీయలేకపోయారు. ఇక చాలా రోజులు వెయిట్ చేసిన దీపిక పదుకొనే వేరే సినిమాకి డేట్స్ ఇవ్వడంతో  ఈ సినిమాలోకి త్రిష ఎంట్రీ ఇచ్చింది.అలా ఒకవేళ అనుకున్న సమయానికి గనక బండ్ల గణేష్ సినిమా తెరకెక్కించి ఉంటే కచ్చితంగా దీపికా పదుకొనే పవన్ కాంబోలో ఈ భూమి బ్లాక్ బస్టర్ అయ్యేది అని అందరూ భావించారు. 

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్పందిస్తూ ఈ మూవీ ఎడిటింగ్ చేసి కచ్చితంగా రీ రిలీజ్ చేస్తాను అంటూ చెప్పారు.అయితే ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కొన్ని కొన్ని తప్పిదాల కారణంగా ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. అంతేకాదు ఇప్పుడు ఆ సినిమాను గనుక రీ రిలీజ్ చేస్తే కచ్చితంగా రికార్డులు కొల్లగొడుతుంది అని చాలామంది సినీ విశ్లేషకులు అంటున్నారు. అలా బండ్ల గణేష్ లేట్ చేయడం వల్ల ఈ సినిమా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరిగడంతో ఫ్లాప్ అయిందట. అలా బండ్ల గణేష్ చేసిన తప్పు వల్ల పవన్ మూవీ ఫ్లాఫ్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: