సాధారణంగా చిత్ర పరిశ్రమలో అవకాశం రావాలంటే ఇండస్ట్రీలో ఎంతో కొంత పరిచయాలు ఉండాలి అంటారు.. అలా ఉన్నప్పుడే ఎవరికీ మన అవసరం ఉన్నా కూడా మనకు ఉన్న పరిచయాలు ద్వారా సినిమాల్లో మనకు అవకాశాలు వస్తాయి.  దీంతో మనకు పెద్ద ఛాన్సులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ సూపర్  స్టార్ గా ఎదిగే అవకాశం ఉంటుంది.. ఈ విషయం చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్ లో పనిచేసే వారికి వర్తిస్తుంది.


స్టార్ దర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో వచ్చిన కొత్తలో నటుడు కం రచయిత పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్గా పని చేసిన విషయం తెలిసిందే .. అలాగే పవిత్ర బంధం సినిమాకి పోసాని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నప్పుడే వెంకటేష్ తో త్రివిక్రమ్ కి మంచి స్నేహం కుదిరింది .. అదే సమయంలో త్రివిక్రమ్ ఇండస్ట్రీలో మనకు పరిచయాలు బాగా ఉంటేనే ఎదగగలుగుతాం అనే విషయాన్ని గ్రహించారట. దీంతో  దీంతో వెంకటేష్ తో బాగా మాట్లాడి ఆయనతో చనువు పెంచుకున్నారట.


త్రివిక్రమ్ స్టార్ రైటర్గా ఎదిగిన తర్వాత వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి కథ చెప్పే సమయంలో కూడా అంతకుముందు వెంకటేష్ తో ఉన్న చనుమును ఆ సమయంలో ఉపయోగపడిందట.  అలా ఇండస్ట్రీలో పరిచయాలే చాలా ముఖ్యమని చాలా మంది సినీ ప్రముఖులు సైతం చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు వెంకటేష్ కు త్రివిక్రమ్ కి మధ్య మంచి అనుబంధం ఉందని వారి సన్నిహిత వర్గాల వారు చెబుతూ ఉంటారు ..  అందుకే వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి వంటి సినిమాలు తో మంచి సక్సెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా స్టోరీ కుదిరితే వెంకటేష్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .
 

మరింత సమాచారం తెలుసుకోండి: