టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈ సినిమాలలో హిట్ గా నిలిచే సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే టాలీవుడ్ సినిమాలలో కేవలం 5 సినిమాలు మాత్రమే 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ 5 సినిమాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లో ఉంది.
 
ఈ 5 సినిమాలు ఇప్పటికి టాలీవుడ్ టాప్5 సినిమాలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ సొంతం చేసుకున్న సినిమా బాహుబలి2 ఒకటి. ఈ సినిమా తక్కువ టికెట్ రేట్లతోనే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఫుట్ ఫాల్స్ విషయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం గమనార్హం.
 
క్రిటిక్స్ నుంచి సైతం పాజిటివ్ రివ్యూలను ఈ సినిమా సొంతం చేసుకోగా ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. ఈ రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న మరో సినిమా ఏదనే ప్రశ్నకు ఆర్.ఆర్.ఆర్ సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. ప్రభాస్ నటించిన కల్కి, సలార్ సినిమాలు సైతం 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
 
తాజాగా థియేటర్లలో విడుదలైన దేవర సినిమా సైతం ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం. దేవర సినిమా సాధించిన ఘనత ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర సీక్వెల్ ను సైతం వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లేలా మేకర్స్ ప్లానింగ్ ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాతో బిజీ కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: