టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటి వరకు అనేక సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సంవత్సరం ఈయన నిర్మించిన సినిమాలలో మొదటగా మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా థియేటర్లలో విడుదల కాక ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈయన నిర్మించిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాత లక్కీ భాస్కర్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటించగా ... మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులు కథ , కథనాల గురించి పెద్దగా పట్టించుకోకుండా చూస్తారు. తమ అభిమాన హీరో ఎలా డాన్స్ చేస్తున్నాడు. ఎలా ఫైట్స్ చేస్తున్నాడు.

ఎలా డైలాగులు చెబుతున్నాడు. అతనిపై అద్భుతమైన మాస్ సన్నివేశాలు ఉన్నాయా ... లేదా. అతన్ని అద్భుతంగా ఎలివేట్ చేశారా ... లేదా ఇలాంటివే చూస్తారు. అంతే కానీ స్టార్ హీరోల సినిమాలలో కథ , స్క్రీన్ ప్లే ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు అని కామెంట్స్ చేశాడు. దీనితో ఈయన చేసిన కామెంట్స్ పై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: