టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ...హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ అంతా కాదు. తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన సాయి పల్లవి.. మన తెలుగులోనే బాగా పాపులర్ అయ్యారు. తెలంగాణ యాస భాష... అద్భుతంగా మాట్లాడి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. 32 ఏళ్ల సాయి పల్లవి... సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.



2005లో ఇండస్ట్రీలో కస్తూరి మాన్ అనే సినిమాతో అడుగుపెట్టారు. తమిళంలో మంచి హీరోయిన్ గా సెటిల్ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ తరుణంలోనే 2017 సంవత్సరంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సాయి పల్లవి. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి  అంటూ రచ్చ చేశారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.


ఇప్పుడు ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తారు. అంతలా పాపులర్ అయిపోయింది ఈ హీరోయిన్ సాయి పల్లవి. సినిమాలో హీరో కంటే సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి సాయి పల్లవికి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో సాయి పల్లవికి 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటు ఎక్స్ ఖాతాలో ఆమెకు 2.8  మిలియన్ ఫాలోవర్స్ ఉన్నవారు.


ఇక ఫేస్బుక్ లో సాయి పల్లకి 3.2 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం జరిగింది. అయితే... ఇంతటి ఫాలోయింగ్ సౌత్ ఇండియాలో ఏ హీరోయిన్ కి లేదని చెప్పవచ్చు. సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించిన.. ఆమెకు లైకులు అలాగే షేర్లు వస్తాయి. ఇక ఆమె ఎక్కడైనా బయట కనిపిస్తే ఫ్యాన్స్ ఎగబడతారు. ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి తండాల సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవినే హీరోయిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: