బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లలో చాలామంది మెంటల్ పేషెంట్లలాగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పృథ్వి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. హౌజులోని అందరినీ అరేయ్, ఒరేయ్ అంటూ అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే వారిపై పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇంకా హౌస్ లో చేయకూడని అన్ని పనులు చేస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. అయితే అలాంటి ఒక వరస్ట్ క్యారెక్టర్‌ను పంపించినట్లు నిన్న అంతా ప్రచారం జరిగింది కానీ అందులో లేదని తాజాగా తెలిసింది. పృథ్వికి బదులుగా మణికంఠను ఎలిమినేట్ చేశారని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి మణికంఠనే తను హౌస్‌లో ఉండలేనని అంటూ బయటికి వచ్చేశాడు టాక్.

టేస్టీ తేజ, హరితేజలకు చాలా తక్కువగా ఓట్లు వచ్చాయని, వారిని సేవ్ చేస్తూ పృథ్విని ఎలిమినేట్ చేశారని నిన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. మెయిన్ స్ట్రీమ్ సైట్లు సహా అన్ని యూట్యూబ్ చానెళ్లూ పృథ్వి వెళ్లిపోయినట్లుగానే వార్తలు రాశాయి. నిజానికి బాగా తలనొప్పి తెప్పించే క్యారెక్టర్ అతడు కాబట్టి పంపించడంలో తప్పు లేదని ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే బిగ్‌బాస్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.

లాస్ట్ ఎపిసోడ్‌లో మణికంఠ నాగార్జునకు ఒక వింత విజ్ఞప్తి చేసినట్లుగా తెలిసింది. తన శరీరం, మెదడు ఏమీ పనిచేయడం లేదని, హౌజులో కొనసాగేంత శక్తి తనకు లేదని, అందుకే తనని ఇంటికి పంపించేయాలని అతను మొరపెట్టుకున్నాడు. కానీ ఇంతకుముందు బిగ్ బాస్ లో గెలిస్తే తన పెళ్లాం, బిడ్డలు తన దగ్గరకు వస్తారని, అందుకే ఎలాగైనా బాగా ఆడి గెలుస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. బాగా ఏడ్చేసాడు కూడా. కానీ ఇప్పుడు మాత్రం తనంతట తానే హౌస్ లో నుంచి బయటికి పంపించాలని వేడుకున్నాడట.

మొదట్లో బిగ్‌బాస్ టీమ్‌ మెడికల్ రూమ్‌కు పంపించి మణికంఠకు చెకప్ చేయించింది. వారి టెస్టుల్లో మణికంఠ మెంటల్లీ ఫుల్ హెల్తీగా ఉన్నాడని చెప్పారట. దాని తర్వాత అతను కావాలనే పిచ్చోడి లాగా ప్రవర్తిస్తూ సింపతీ క్రియేట్ చేస్తున్నాడనే డౌట్ వచ్చింది. మణికంఠ ఇలాంటి కష్టం లేకుండా సర్వైవ్ అవ్వాలని చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈమధ్య ఫిజికల్ టాస్కుల్లో అసలే పార్టిసిపేట్ చేయలేదు. తన కాళ్లూ చేతులు విరిగిపోతాయేమో అని ఫిజికల్ టాస్కులను బహిష్కరించాడు. ఈ మెంటల్ కేసు హౌజులో ఉన్నంత సేపు అందరూ కనిపెట్టుకొని ఉండాల్సి వస్తోంది. ఏ అఘాయిత్యం అయినా చేసుకుంటే చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి బిగ్ బాస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక అతన్ని భరించలేక ఈ వారమే బయటకు సాగనంపి ఉండవచ్చు. లేదంటే సీక్రెట్ రూమ్‌లోకి పంపించొచ్చు.

బిగ్‌బాస్ ఎలిమినేషన్ల గురించి వస్తున్న లికుల గురించి తెలుసుకునే ఉంటాడు. అందుకే తొలత తప్పుడు సమాచారాన్ని లీక్ చేసి ఆ తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేయాలో వారిని చేస్తున్నాడు. అందువల్ల షోలో ఒక సస్పెన్స్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది. సో మణికంఠనే ఖచ్చితంగా వెళ్ళిపోయాడని ప్రస్తుతానికైతే చెప్పలేం. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: